మోదీ తెలంగాణ ఓటర్ల కోసం తెలుగులో ట్వీట్

- December 07, 2018 , by Maagulf
మోదీ తెలంగాణ ఓటర్ల కోసం తెలుగులో ట్వీట్

రోడ్లన్నీ ఓటర్లతో నిండిపోయాయి. సైలెంట్‌గా తమకు నచ్చిన నాయకుడికి ఓటేస్తున్నారు. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఉన్నారు.

ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌ రాష్ట్రంలోనూ ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ ఇరు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని సందేశమిచ్చారు. తెలంగాణ ప్రజల కోసం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com