ఎన్నికలు అయ్యాయి, బెట్టింగులు ఊపందుకున్నాయి
- December 08, 2018
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ళ హావా కొనసాగుతోంది.. అందులో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సర్వేలతో మరింత ఊపందుకుందని చెప్పవచ్చు.. జాతీయ సర్వేల్లో తెరాసా కు పట్టం కట్టగా, లగడపాటి కూటమికి ఆధిక్యం వస్తుందని తెలిపడం తో బెట్టింగ్ రాయుళ్ళు ధీమాగా ఉంటున్నారు.. కొన్నినియోజక వర్గాలపై మరింత జోరుగా బెట్టింగులు కొనసాగుతున్నాయి..
ముఖ్యంగా కొన్ని నియోజక వర్గాలపై బెట్టింగ్ రాయుళ్ళు ఆసక్తి చూపుతున్నారు .. హైదరాబాద్ కూకట్ పల్లి నియోజక వర్గం ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని, టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు మధ్య పోటీ ఆసక్తిగా నెలకొన్న నేపధ్యంలో ఈ నియోజక వర్గం ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ళు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారు ..
కొడంగల్ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్ర మధ్య గట్టి పోటీ ఉండటంతో బెట్టింగ్ రాయుళ్ళు తమ చేతివాటం చూపుతున్నారు ఇలా అనేక నియోజక వర్గాలపై ఆసక్తికరంగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం..మరి తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే దానికన్నా బెట్టింగ్ పై అందరు చర్చించుకుంటున్నారు..
తాజా వార్తలు
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్







