ఫేస్బుక్కు భారీ జరిమానా
- December 08, 2018
ఇప్పటికే కేంబ్రిడ్జ్ అనలిటికా కుంభకోణంతో ఫేస్బుక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాంతో పలు దేశాల్లో ఫేస్బుక్ జరిమానాలు కట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా మరో దేశం(ఇటలీ) ఫేస్బుక్ కు భారీ జరిమానా విధించింది. యూజర్ల అనుమతి లేకుండా వారి వివరాలను విక్రయిస్తోందని ఆరోపిస్తూ వినియోగదారుల భద్రత చట్టాలను ఫేస్బుక్ ఉల్లంగించినదని పేర్కొంది. దాంతో ఫేస్బుక్ కు 8.9 మిలియన్ యూరోల(ఇండియా కరెన్సీలో రూ. 70కోట్లకు పైమాటే) జరిమానా విధించింది. అయితే ఫేస్బుక్ మాత్రం తాము ఖాతాదారుల డేటాను విక్రయించలేదని వాదిస్తోంది. కాగా అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో కోట్లాది మంది ఫేస్బుక్ యూజర్లు తమ డేటా దుర్వినియోగం అయిందని ఆరోపించారు. అప్పట్లో ఫేస్బుక్ వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
తాజా వార్తలు
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!







