దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- July 11, 2026
దోహా: దివ్యాంగులు మరియు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) ఉన్న చిన్నారులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించే దిశగా ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న ఎడ్యుకేషన్ వౌచర్ పథకాన్ని విస్తరించి, ఇకపై నర్సరీల్లో చదివే చిన్నారులు మరియు ప్రైవేట్ విద్యా కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చింది. ఖతార్ విద్యా, ఉన్నత విద్యా శాఖ మంత్రి లోల్వా బింట్ రషీద్ బిన్ మహ్మద్ అల్ ఖాతర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మంత్రివర్గం ఆమోదించిన ఈ నిర్ణయంతో అర్హులైన పిల్లలకు ఏడాదికి QR 43,000 నుంచి QR 78,000 వరకు విద్యా వౌచర్లు అందించనున్నట్లు తెలిపారు.
ఈ పథకం ద్వారా దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు చిన్న వయస్సులోనే అవసరమైన విద్యా, పునరావాస సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. అలాగే ప్రత్యేక విద్యా సేవల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరిగి, సేవల నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాల సమయాల తర్వాత, సెలవులలోనూ విద్యా, పునరావాస సేవలు కొనసాగించే అవకాశం ఉండటంతో పిల్లలకు నిరంతర సహాయం అందనుండగా, తల్లిదండ్రులకు కూడా ఉపశమనం లభించనుంది.
ఆమోదిత వైద్య నివేదికల ఆధారంగా అర్హులైన వారికి ఈ పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు నాణ్యమైన విద్య, పునరావాస సేవలు అందించడం దేశ బాధ్యతగా భావిస్తున్నామని, సమాజంలోని ఈ వర్గానికి అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పించడం ఖతార్కు గర్వకారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







