50 ప్లస్ వయసున్న వారిపై ఎలాంటి బ్యాన్ లేదు
- December 23, 2015
50 ఏళ్ళ పైబడి, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వలసదారులపై బ్యాన్ లేదా రిటైర్మెంట్ అంశమేదీ తమ పరిశీలనలో లేదని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ కువైట్లోని స్థానిక మీడియా, ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న 50 ఏళ్ళ పైబడినవారిని మార్చ్ 2016 తర్వాత ఏ క్షణంలో అయినా టెర్మినేట్ చేసే అవకాశముందని పేర్కొంది. దీనిపై ఒమన్ ప్రభుత్వం స్పందిస్తూ అలాంటి ఆలోచన తమ ప్రభుత్వం చేయడంలేదని పేర్కొంది. ఒమన్ గవర్నమెంట్ డేటా ప్రకారం 1,682,752 మంది వలసదారులు ఒమన్లో పనిచేస్తున్నారు. అయితే మజ్లిస్ అల్ షురా మెంబర్ మాట్లాడుతూ, వలసదారులకు అలాగే ఒమన్ జాతీయులకూ రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉందనీ, అలా చేస్తే కొత్తవారికి అవకాశం దొరుకుతుందనీ, కొత్త కొత్త ఆలోచనలతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని చెప్పారు. ఉద్యోగులు మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన పేర్కొంటూ, కొత్తవారికీ అవకాశం కల్పించడంలో తప్పు లేదని అన్నారు. కువైట్లో మారతం 50 ఏళ్ళ పైబడిన ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







