దుబాయ్ గార్డెన్ గ్లో సందర్శకుల కోసం సిద్ధం
- December 23, 2015
ప్రపంచంలోనే అతి పెద్దదైన, ప్రత్యేకమైన 'గ్లో డెస్టినేషన్'గా పేర్కొనబడ్తున్న దుబాయ్ గార్డెన్ గ్లో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ గార్డెన్లోకి ప్రవేశించడానికి 60 దిర్హామ్లను రుసుముగా నిర్ణయించారు. యూఏఈ నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ అహ్మద్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నాజర్ లూతాహ్, ఇతర ఉన్నతాధికారులు, మీడియా ప్రతినిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాజర్ లూతాహ్ మాట్లాడుతూ, నాలుగు మిలియన్ల లైట్లు వివిధ రంగుల్లో ఈ పార్కులో దర్శనమిస్తాయన్నారు. వచ్చే రంజాన్ వరకూ సందర్శకుల్ని ఈ గార్డెన్ విశేషంగా ఆకట్టుకోనుంది. 'ఆర్ట్ బై డే, గ్లో బై నైట్' అనే కాన్సెప్ట్తో చెట్లు, మొక్కలు, పువ్వులు, చీమలు, ఇతర జంతువులు గార్డెన్లో పొందుపర్చారు. రీసైకిల్ చేసిన సిల్క్ని గ్లోయింగ్ టచ్ కోసం వినియోగించారు. 40 ఎకరాల ఈ గార్డెన్లోకి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం కల్పిస్తారు. అయితే ప్రవేశ రుసుముపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







