శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం
- December 14, 2018శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాల భాగోతం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో పలువురు ఎయిర్పోర్ట్ సిబ్బంది పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఓ ఎయిర్లైన్స్కు చెందిన పలువురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలోనూ విచారణ చేపట్టారు.
సాధారణంగా విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్టుతో పాటు వీసా తప్పనిసరి. ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికుల పాస్పోర్టులు, వీసాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే అనుమతిస్తారు. అయితే.. ఓ ఎయిర్లైన్స్కు చెందిన కొందరు సిబ్బంది నకిలీ వీసాలతో చెక్కేసేవారితో కుమ్మక్కై ఈ దందాకు తెరలేపారు. ఎయిర్లైన్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం