సోలార్ పవర్ కోసం జాయింట్ వెంచర్
- December 24, 2015
ఖతార్ పెట్రోలియం (క్యుపి), ఖతార్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కంపెనీ (క్యుఇడబ్ల్యుసి) సంయుక్తంగా విద్యుత్ ఉత్పాదకతను ప్రారంభించనున్నాయి సోలార్ పవర్ ద్వారా. ఇందులో క్యుపి 40 శాతం కలిగి ఉంటుంది. క్యుఇడబ్ల్యుసి 60 శాతం వాటా కలిగి ఉంటుంది. క్యుపి ప్రెసిడెంట్ సాద్ షెరిదా అల్ కాబి, క్యుఇడబ్ల్యుసి మేనేజింగ్ డైరెక్టర్ ఫహాద్ హమాద్ అల్ మొమానది 'ఎంఓయు'పై సంతకం చేశారు ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని సమక్షంలో. కాలుష్యం లేకుండా, సౌర శక్తి ద్వారా విద్యుత్ని తయారు చేసే ఈ విధానం, ఖతార్ నేషనల్ విజన్ 2030లో భాగంగా రూపొందుతుందనీ, దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అవుతుందని షేక్ అబ్దుల్లా చెప్పారు. క్యుఇడబ్ల్యుసి, ఇతర సంస్థలతో కలిసి 8,600 మెగావాట్ల నుంచి 11 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని 2018 నాటికి సాధించే లక్ష్యంతో దూసుకుపోతుందని ఆ సంస్థ ప్రతినిథులు వివరించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







