హైదరాబాద్:తల్లి చనిపోయిందని వైద్యులు చెప్పగానే..
- December 26, 2018
హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిపై రోగి బంధువుల దాడిని సీరియస్గా తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు . దాడిచేసిన నలుగురి నిందితులను అరెస్ట్ చేశారు .. అరెస్ట్ అయిన వారిలో మోహీనోద్దీన్ అలీఖాన్, భర్కత్ అలీఖాన్, సుజత్ అలీఖాన్, మోహిన్ ఖాన్లు ఉన్నారు.
ఈ నెల 18న 45 ఏళ్ల షమీనా బేగం చికిత్స కోసం లక్డీకాపూల్ గ్లోబల్ ఆస్పత్రిలో చేరింది . అప్పటికే ఆమెకు ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. దాదాపు రెండు లక్షల వరకు కట్టారు షమీనా బేగం కుమారులు. అయితే ఆరు రోజుల తర్వాత… హార్ట్ హటాక్ రావడంతో.. షమీనా బేగం చనిపోయిందని వెల్లడించారు వైద్యులు.
అప్పటి వరకు సమీనా బేగం ప్రాణాలు కాపాడాలంటూ డాక్టర్లకు మొక్కుతూ.. రోధిస్తూ ఆసుపత్రి దగ్గరే ఉన్నారు ఆమె కుమారులు, బంధువులు. అయితే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పగానే.. వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. అంతే అది ఆసుపత్రి అనే విషయం మరచిపోయారు.. సమీనా బేగం మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ రెచ్చిపోయి ఆసుపత్రిని ధ్వంసం చేశారు..
ఆసుపత్రి రిసెప్షన్ కౌంటర్ లోని రెండు కంప్యూటర్లుతో పాటు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన వైద్యులనూ చితక్కొట్టారు. అక్కడికొచ్చిన కానిస్టేబుల్పైనా దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో… అదనపు బలగాలను రప్పించి.. పరిస్థితిని అదుపులో తెచ్చారు పోలీసులు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు ..
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







