భార్య మృతి: బ్లడ్ మనీ చెల్లించిన భర్త
- December 26, 2018
25 ఏళ్ళ భారతీయ మహిళ దివ్య ప్రవీణ్, రస్ అల్ ఖైమాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆమె భర్త 200,000 బ్లడ్ మనీ చెల్లించాల్సి వచ్చింది. అటార్నీ జనరల్ ఆదేశాల మేరకు ఈ బ్లడ్ మనీని ఆమె భర్త చెల్లించారు. అలాగే 2,500 జరీమానా సైతం డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్కి విధించడం జరిగింది. రస్ అల్ ఖైమా - ఇండియన్ రిలీఫ్ కమిటీ సోసల్ వర్కర్ పుష్పన్ గోవిందన్ మాట్లాడుతూ, 200,000 బ్లడ్ మనీ, 2,500 దిర్హామ్ల జరీమానా చెల్లించాక ప్రవీణ్ విడుదలయినట్లు చెప్పారు. ఇండియన్ రిలీఫ్ కమిటీ వలంటీర్ రఘు మాష్ మాట్లాడుతూ, ప్రవీణ్ స్నేహితులు, బంధువులు బ్లడ్ మనీని కోర్టుకు చెల్లించారని అన్నారు. ప్రవీణ్కి రెండేళ్ళ కుమారుడున్నారు. లీగల్ ఫార్మాలిటీస్ తర్వాత మృతదేహంతో ప్రవీణ్ ఇండియాకి బయల్దేరారు. ప్రవీణ్, రస్ అల్ ఖైమా హట్చిసన్ పోర్ట్స్లో పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రవీణ్ ప్రాణాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







