భార్య మృతి: బ్లడ్ మనీ చెల్లించిన భర్త
- December 26, 2018
25 ఏళ్ళ భారతీయ మహిళ దివ్య ప్రవీణ్, రస్ అల్ ఖైమాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఆమె భర్త 200,000 బ్లడ్ మనీ చెల్లించాల్సి వచ్చింది. అటార్నీ జనరల్ ఆదేశాల మేరకు ఈ బ్లడ్ మనీని ఆమె భర్త చెల్లించారు. అలాగే 2,500 జరీమానా సైతం డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్కి విధించడం జరిగింది. రస్ అల్ ఖైమా - ఇండియన్ రిలీఫ్ కమిటీ సోసల్ వర్కర్ పుష్పన్ గోవిందన్ మాట్లాడుతూ, 200,000 బ్లడ్ మనీ, 2,500 దిర్హామ్ల జరీమానా చెల్లించాక ప్రవీణ్ విడుదలయినట్లు చెప్పారు. ఇండియన్ రిలీఫ్ కమిటీ వలంటీర్ రఘు మాష్ మాట్లాడుతూ, ప్రవీణ్ స్నేహితులు, బంధువులు బ్లడ్ మనీని కోర్టుకు చెల్లించారని అన్నారు. ప్రవీణ్కి రెండేళ్ళ కుమారుడున్నారు. లీగల్ ఫార్మాలిటీస్ తర్వాత మృతదేహంతో ప్రవీణ్ ఇండియాకి బయల్దేరారు. ప్రవీణ్, రస్ అల్ ఖైమా హట్చిసన్ పోర్ట్స్లో పనిచేస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రవీణ్ ప్రాణాలతో బయటపడ్డారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







