సల్వా రోడ్డుపై మసైయీద్ ఇంటర్ఛేంజ్ వద్ద డైవర్షన్
- December 26, 2018
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్గల్', సల్వా రోడ్డు వెస్ట్ బౌండ్ క్యారేజ్ వేపై మెసైయీద్ ఇంటర్ఛేంజ్ (ఎగ్జిట్ 24) వద్ద తాత్కాలిక డైవర్షన్ని ప్రకటించింది. వారం రోజులపాటు ఈ డైవర్షన్ అమల్లో వుంటుంది. గురువారం నుంచి ఈ డైవర్షన్ అందుబాటులోకి వస్తుంది. తాత్కాలిక డైవర్షన్ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా వాహనదారులకు అధికారులు సూచించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి ఈ డైవర్షన్ని డిజైన్ చేశారు. సల్వా రోడ్డుపై వెస్ట్ బౌండ్ మీదుగా బుసుమ్రా వైపు వెళ్ళే ట్రాఫిక్, సమాంతరంగా వున్న సర్వీస్ రోడ్డు వైపుకు మళ్ళిస్తారు. 3 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డులో ప్రయాణించి తిరిగి సల్వా రోడ్డులో ఈ ట్రాఫిక్ కలుస్తుంది. లేన్స్ సంఖ్యను 3 నుంచి 2కి సర్వీసు రోడ్డుపై తగ్గించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







