సల్వా రోడ్డుపై మసైయీద్ ఇంటర్ఛేంజ్ వద్ద డైవర్షన్
- December 26, 2018
దోహా: పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'అష్గల్', సల్వా రోడ్డు వెస్ట్ బౌండ్ క్యారేజ్ వేపై మెసైయీద్ ఇంటర్ఛేంజ్ (ఎగ్జిట్ 24) వద్ద తాత్కాలిక డైవర్షన్ని ప్రకటించింది. వారం రోజులపాటు ఈ డైవర్షన్ అమల్లో వుంటుంది. గురువారం నుంచి ఈ డైవర్షన్ అందుబాటులోకి వస్తుంది. తాత్కాలిక డైవర్షన్ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సిందిగా వాహనదారులకు అధికారులు సూచించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి ఈ డైవర్షన్ని డిజైన్ చేశారు. సల్వా రోడ్డుపై వెస్ట్ బౌండ్ మీదుగా బుసుమ్రా వైపు వెళ్ళే ట్రాఫిక్, సమాంతరంగా వున్న సర్వీస్ రోడ్డు వైపుకు మళ్ళిస్తారు. 3 కిలోమీటర్ల మేర సర్వీస్ రోడ్డులో ప్రయాణించి తిరిగి సల్వా రోడ్డులో ఈ ట్రాఫిక్ కలుస్తుంది. లేన్స్ సంఖ్యను 3 నుంచి 2కి సర్వీసు రోడ్డుపై తగ్గించారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..