ఆంటీ అంటూ నన్ను ఎవరైనా పిలిస్తే…షూట్ చేయండి: స్మ్రుతి ఇరానీ
- December 28, 2018ప్రస్తుత కాలంలో చాలామంది యువతులకైనా, యువకులకైనా ఎంత వయసు పెరిగినా కూడా ఆంటీ, అంకుల్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు. వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తనకు కూడా ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టముండదు అంటూ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఎయిర్ పోర్టులో అనుకోకుండా స్మృతి ఇరానీ, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కలిశారట. దీంతో ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించారట. 'జాన్వీ కపూర్ నన్ను ఆంటీ అని సంబోధిస్తూ మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నాక ఆంటీ అని పిలిచినందుకు సారీ కూడా చెప్పింది. అప్పుడు నేనేం ఫర్వాలేదు అంటూ సర్ది చెప్పాను. ఈ కాలం పిల్లలు ఉన్నారే… ఆంటీ అంటూ ఎవరైనా పిలిస్తే… ఎవరైనా నన్ను షూట్ చేయండి అని గట్టిగా అరవాలన్పిస్తుంది…' అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు స్మృతీ ఇరానీ. ప్రస్తుతం ఐఏఎఫ్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో, 'తక్త్' అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ కపూర్.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం