అవి తింటే మజ్జిగ తీసుకోవడం తప్పనిసరి...
- January 11, 2019
మసాలా దినుసులు తింటున్నారా.. అయితే తప్పక మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తీసుకున్నవారు తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి. మసాలా దినుసులు తిన్న తరువాత మజ్జిగ సేవించడం ద్వారా అసిడిటీ కూడా తగ్గుముఖం పడుతుంది.
పచ్చని తులసి ఆకులను వేడి నీటిలో మరగించుకోవాలి. కాసేపటివరు అలానే ఉంచి ఆ తరువాత చల్లార్చుకోవాలి. ఈ తులసి నీటిని ప్రతి రోజూ తాగడం వలన
పది రోజుల్లో గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. అలానే గ్యాస్కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. బెల్లం గ్యాస్ సమస్యకు ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది.
ఇకపోతే.. ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







