అవి తింటే మజ్జిగ తీసుకోవడం తప్పనిసరి...
- January 11, 2019
మసాలా దినుసులు తింటున్నారా.. అయితే తప్పక మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తీసుకున్నవారు తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి. మసాలా దినుసులు తిన్న తరువాత మజ్జిగ సేవించడం ద్వారా అసిడిటీ కూడా తగ్గుముఖం పడుతుంది.
పచ్చని తులసి ఆకులను వేడి నీటిలో మరగించుకోవాలి. కాసేపటివరు అలానే ఉంచి ఆ తరువాత చల్లార్చుకోవాలి. ఈ తులసి నీటిని ప్రతి రోజూ తాగడం వలన
పది రోజుల్లో గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. అలానే గ్యాస్కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. బెల్లం గ్యాస్ సమస్యకు ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది.
ఇకపోతే.. ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









