చిన్న వ్యాపారులకు శుభవార్త..
- January 11, 2019
గురువారం జరిగిన జీఎస్టీ మండలి 32వ సమావేశంలో… చిన్న వ్యాపారులకు వస్తు, సేవల పన్ను నుంచి ఊరట లభించింది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమితిని పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. సుదీర్ఘ చర్చ అనంతరం, చిన్న వ్యాపారులకు జీఎస్టీ మినహాయింపు పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్ధిక మంత్రి జైట్లీ. ప్రస్తుతమున్న పరిమితిని 20లక్షల నుంచి 40లక్షల రూపాయలకు పెంచింది. అలాగే కాంపొజిషన్ పథకం కింద ఉండే పరిమితిని కోటి రూపాయలు నుంచి కోటిన్నర రూపాయలు పెంచారు
ఈ స్కీమ్ పరిథిలోకి చిన్న వ్యాపారులు……తమ వ్యాపారాల టర్నోవరును బట్టి తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక… కేరళలో. రెండేళ్ళపాటు జరిగే అమ్మకాలపై 1 శాతం పన్ను విధించుకునేందుకు అనుమతి ఇచ్చింది కౌన్సిల్. ఈ నిర్ణయాల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారస్థులకు ప్రయోజనం కలుగనుంది.
ప్రజలపై పన్ను భారం పడకుండా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ జీఎస్టీని సరళతరం చేస్తోంది కేంద్రం. ఇందులో భాగంగానే గత నెలలో 23 వస్తువులను తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చింది. సినిమా టికెట్లు, 32 అంగుళాల వరకు టీవీలు, పవర్ బ్యాంకులు, డిజిటల్ కెమెరాలు, వీడియో గేమ్స్పై పన్ను భారం తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి జీఎస్టీని సరళతరం చేయడంతో… చిన్న వ్యాపారులకు లాభం చేకూరనుంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







