తేజు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
- January 16, 2019
సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సాయిధరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ .. రితిక సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారనేది తాజా సమాచారం. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కథానాయికలలో ఒకరి పేరు 'చిత్ర' .. మరొకరి పేరు 'లహరి' అయ్యుంటుందనే ఊహాగానాలు వినిపించాయి. కానీ టైటిల్లోని అయిదు అక్షరాలలో, ఒక్కో అక్షరంతో మొదలయ్యే ఒక్కో పేరుతో అయిదు ముఖ్యమైన పాత్రలు ఉంటాయని తెలుస్తోంది. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







