చంద్రుడిపై చైనా అద్భుతం.. మొలకెత్తిన పత్తి విత్తనం!
- January 16, 2019
బీజింగ్: చంద్రుడిపై పత్తి విత్తనం మొలకెత్తింది. ఇటీవల చైనా పంపిన చేంజ్-4 ప్రోబ్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. చేంజ్4 పంపిన చిత్రాల ఆధారంగా చైనా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి శాస్త్రవేత్తలు పలు రకాల విత్తనాలను చంద్రుడి మీదకు తీసుకువెళ్లారు. కానీ వాటిలో పత్తి విత్తనం ఒక్కటే మొలిచినట్లు చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈనెల 3వ తేదీన చంద్రుడి చీకటి ప్రదేశంలో చేంజ్4 ప్రోబ్ దిగింది. చంద్రుడి ఆవలి వైపుకు ఓ రోవర్ వెళ్లడం కూడా ఇదే మొదటిసారి. అయితే ఈ రోవర్పై పత్తితో పాటు ఆయిల్సీడ్ రేప్, పొటాటో, ఆరాబిడోప్సిస్ విత్తనాలను కూడా పంపించారు. సౌత్వెస్ట్ చైనాలోని చాంగ్కింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విత్తనాలను ఆ ప్రోబ్లో పొందుపరిచారు. గతంలో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలో మొక్కలు మొలిచాయి. కానీ చంద్రుడి మీద ఓ విత్తనం మొలకెత్తడం ఇదే ప్రథమం. ఇక నుంచి ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోనే తమ ఆహారాన్ని పండిస్తారని, తిండి కోసం వాళ్లు తిరిగి భూమికి రావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పంటలతో చంద్రుడిపై జీవానుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్న విషయం తెలిసిందే. 18 సెంటీమీటర్ల క్యాన్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







