చంద్రుడిపై చైనా అద్భుతం.. మొలకెత్తిన పత్తి విత్తనం!
- January 16, 2019
బీజింగ్: చంద్రుడిపై పత్తి విత్తనం మొలకెత్తింది. ఇటీవల చైనా పంపిన చేంజ్-4 ప్రోబ్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. చేంజ్4 పంపిన చిత్రాల ఆధారంగా చైనా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి శాస్త్రవేత్తలు పలు రకాల విత్తనాలను చంద్రుడి మీదకు తీసుకువెళ్లారు. కానీ వాటిలో పత్తి విత్తనం ఒక్కటే మొలిచినట్లు చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈనెల 3వ తేదీన చంద్రుడి చీకటి ప్రదేశంలో చేంజ్4 ప్రోబ్ దిగింది. చంద్రుడి ఆవలి వైపుకు ఓ రోవర్ వెళ్లడం కూడా ఇదే మొదటిసారి. అయితే ఈ రోవర్పై పత్తితో పాటు ఆయిల్సీడ్ రేప్, పొటాటో, ఆరాబిడోప్సిస్ విత్తనాలను కూడా పంపించారు. సౌత్వెస్ట్ చైనాలోని చాంగ్కింగ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విత్తనాలను ఆ ప్రోబ్లో పొందుపరిచారు. గతంలో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలో మొక్కలు మొలిచాయి. కానీ చంద్రుడి మీద ఓ విత్తనం మొలకెత్తడం ఇదే ప్రథమం. ఇక నుంచి ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోనే తమ ఆహారాన్ని పండిస్తారని, తిండి కోసం వాళ్లు తిరిగి భూమికి రావాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పంటలతో చంద్రుడిపై జీవానుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్న విషయం తెలిసిందే. 18 సెంటీమీటర్ల క్యాన్లో ఈ ప్రయోగాన్ని చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







