నలుగురు అమ్మాయిల కథ

- January 22, 2019 , by Maagulf
నలుగురు అమ్మాయిల కథ

 

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హిమ బిందు వెలగపూడి నిర్మాణంలో బాలు దర్శకత్వంలో తెరకెక్కనుంది. దర్శకుడు బాలు మాట్లాడుతూ 'మహానగరంలో నివసిస్తూ స్వతంత్య్ర భావాలున్న నలుగురు అమ్మాయిలకు సంబంధించిన కథే ఈ చిత్రం. త్రిదా చౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధి ఇద్నాని, కొమలి ప్రసాద్‌ నలుగురు అమ్మాయిలుగా నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానుగుణంగా ఉండే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుం టాయి' అని అన్నారు. 

నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ 'హైదరాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైంది. ఫిబ్రవరిలో గోవాలో రెండో షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి మే నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : రఘుకుంచె, సినిమాటోగ్రఫీ : శేఖర్‌ గంగమోని, పాటలు : భాస్కర భట్ల, లక్ష్మీ భూపాల్‌, ఎడిటింగ్‌ : నాగేశ్వర్‌ రెడ్డి, పి.ఆర్‌.ఒ: ఫణి - నాయుడు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విక్కీ రొలర్‌ కొస్టర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ : సాయికుమార్‌ పాలకూరి, సహ నిర్మాతలు: రాధికా శ్రీనివాస్‌ వెత్షా, ఉమా కూచిపూడి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com