ముంబయి:స్నేహితుడిని చంపి..200 ముక్కలు చేసి టాయిలెట్లో పడేశాడు
- January 25, 2019
ముంబయి:స్నేహితుడిని చంపి అతని శరీరాన్ని 200 ముక్కలు చేసి వాటిని మరుగుదోడ్డిలో పడేసిన దారుణ హత్య సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. హత్య గురైన వ్యక్దిని గణేశ్ కొల్హాద్కర్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు పింటూ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. కొల్హాద్కర్ అనే వ్యక్తి గతంలో తన స్నేహితుడు శర్మ దగ్గర రూ. లక్ష అప్పు చేశాడు. కొద్దిరోజుల తర్వాత కొంత మెుత్తం చేల్లించాడు. మిగతా సోమ్ము కూడా చేల్లించాలని కొల్హాద్కర్పై శర్మ ఓత్తిడి తెచ్చాడు.
గత డిసెంబరు 16న కొల్హాద్కర్ ఇంటికి వేళ్ళిన శర్మ అతనితో గొడువకు దిగాడు. ఈ క్రమంలో మాట మాట పేరిగి కొల్హాద్కర్ను శర్మ గోడకేసి కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం కొల్హాద్కర్ మృతదేహాన్ని అక్కడినుంచి తీసికేళ్ళి దాన్ని దాదాపు 200 ముక్కలుగా చేసి మరుగుదొడ్డిలో పడేసి నీళ్లు కొట్టేశాడు. ఈ కారణంగా అతను ఉండే భవనంలోని డ్రైనేజి వ్యవస్థ నిలిచిపోవడంతో స్థానికులు శుభ్రపరివాళ్ళను పిలిపించారు. వాళ్ళు డ్రైనేజి వ్యవస్థను క్లిన్ చేస్తున్న సమయంలో మనిషి శరీర బాగాలు బయటపడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైయ్యారు వెంటనే పోలీసులకుసమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వారు ముక్కలుగా ఉన్న శరీర బాగాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు శర్మ చేసిన హత్య విషయం బయటపడింది.
తాజా వార్తలు
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!
- ప్రాంతీయ భద్రత, సముద్ర ముప్పులపై అరబ్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!









