ముంబయి:స్నేహితుడిని చంపి..200 ముక్కలు చేసి టాయిలెట్లో పడేశాడు
- January 25, 2019
ముంబయి:స్నేహితుడిని చంపి అతని శరీరాన్ని 200 ముక్కలు చేసి వాటిని మరుగుదోడ్డిలో పడేసిన దారుణ హత్య సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది. హత్య గురైన వ్యక్దిని గణేశ్ కొల్హాద్కర్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు పింటూ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. కొల్హాద్కర్ అనే వ్యక్తి గతంలో తన స్నేహితుడు శర్మ దగ్గర రూ. లక్ష అప్పు చేశాడు. కొద్దిరోజుల తర్వాత కొంత మెుత్తం చేల్లించాడు. మిగతా సోమ్ము కూడా చేల్లించాలని కొల్హాద్కర్పై శర్మ ఓత్తిడి తెచ్చాడు.
గత డిసెంబరు 16న కొల్హాద్కర్ ఇంటికి వేళ్ళిన శర్మ అతనితో గొడువకు దిగాడు. ఈ క్రమంలో మాట మాట పేరిగి కొల్హాద్కర్ను శర్మ గోడకేసి కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం కొల్హాద్కర్ మృతదేహాన్ని అక్కడినుంచి తీసికేళ్ళి దాన్ని దాదాపు 200 ముక్కలుగా చేసి మరుగుదొడ్డిలో పడేసి నీళ్లు కొట్టేశాడు. ఈ కారణంగా అతను ఉండే భవనంలోని డ్రైనేజి వ్యవస్థ నిలిచిపోవడంతో స్థానికులు శుభ్రపరివాళ్ళను పిలిపించారు. వాళ్ళు డ్రైనేజి వ్యవస్థను క్లిన్ చేస్తున్న సమయంలో మనిషి శరీర బాగాలు బయటపడడంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైయ్యారు వెంటనే పోలీసులకుసమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న వారు ముక్కలుగా ఉన్న శరీర బాగాలను పోస్ట్మార్టంకు తరలించారు. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులకు శర్మ చేసిన హత్య విషయం బయటపడింది.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్న్యూస్.. ఖతార్ నుంచి భారత్కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







