'మలాల్' గా వస్తున్న '7/జి బృందావన కాలని'
- January 25, 2019
ఒకటిన్నర దశాబ్దం క్రితం సంచలనం సృష్టించిన '7/జి బృందావన కాలని' గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ సినిమాని సంజయ్ లీలా భన్సాలీ హిందీలో రీమేక్ చేస్తున్నారట. దాదాపు పదిహేనేళ్ళ క్రితం విడుదలై బాక్సాఫీస్ని షేక్ చేసిందీ రొమాంటిక్ ఎంటర్టైనర్. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా.. తమిళంలో '7/జి రెయిన్ బో కాలని' పేరుతో రిలీజై అక్కడా ఘనవిజయం సాధించింది. యువన్ శంకర్ రాజా సంగీత సారధ్యంలో రూపొందిన పాటలన్నీ అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి.
తెలుగు, తమిళ భాషల్లో అలరించిన '7/జి బృందావన కాలని' ఆ తరువాత బెంగాలీ, ఒడియా, కన్నడ భాషల్లోనూ రీమేక్ అయి ఆదరణ పొందింది. కన్నడంలో 'గిల్లి' పేరుతో రూపొందిన ఈ సినిమా ద్వారానే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా తొలి అడుగులు వేసింది. అలాంటి '7/జి బృందావన కాలని'ని ఇప్పుడు హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీతో పాటు టి-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. నేషనల్ అవార్డు విన్నర్ మంగేశ్ హదవలే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాతో భన్సాలీ మేనకోడలు షర్మిన్ సెగల్ హీరోయిన్ గానూ, బాలీవుడ్ కమెడియన్ జావేద్ జాఫ్రీ తనయుడు మిజాన్ హీరోగా పరిచయం కానున్నారు. 'మలాల్' పేరుతో రూపొందుతున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. ఈ ఏడాది ద్వితీయార్థంలో తెరపైకి రానుంది. అయితే రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటికీ ఎక్కడా ఇది రీమేక్ చిత్రమని యూనిట్ ప్రచారం చేయకపోవడం విశేషం.
మరి హిందీలో కూడా '7జి' సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- యూరప్కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!







