నిలిచిపోయిన 8 లక్షల మంది ఉద్యోగుల వేతనాలు.. అలా చేస్తే వారికి ఉపసమనం!
- January 25, 2019
అమెరికాలో నెలరోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్ కు ముగింపు పలికేందుకు రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. తాత్కాలిక బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు సమాయాత్తమవుతున్నారు. ప్రతినిధుల సభలో ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించక పోవడంతో దేశంలో షట్ డౌన్ కొనసాగుతోంది.
అమెరికా మెక్సికో సరిహద్దు గోడనిర్మాణ నిధులకు ప్రెసిడెంట్ ట్రంప్ పట్టుబడుతుండగా… డెమోక్రటిక్ ప్రతినిధులు అందుకు నిరాకరిస్తుండటంతో పరిస్థితి షట్ డౌన్ కు దారితీసింది. దీంతో దేశంలో 8లక్షలమంది ఉద్యోగులకు వేతనాలు నిలిచిపోవడంతో దుర్బర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అయితే ఈ పరిస్థితిని అదిగమించేందుకు సెనెటర్లు తాత్కాలిక ఫండ్ బిల్లును కాంగ్రెస్ లో ప్రవేశపెట్టేందు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల దేశంలో లక్షలాదిమందికి కొంత ఉపసమనం లభిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









