రాహుల్ పై బయోపిక్..'మై నేమ్ ఈజ్ రాగా'..
- February 10, 2019
పొలిటికల్ బయోపిక్లలో మరో తాజా బయోపిక్ రాబోతోంది. 'మై నేమ్ ఈజ్ రాగా' అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపనున్నారు. దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్ కూడా అయిన రూపేష్ పాల్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ టీజర్ విడుదలయింది. ఇది ఒకవిధంగా రాహుల్ బయోపిక్ అనడం కన్నా రాజకీయంగా తనకు ఎదురైనా దాడులను, ఆటుపోట్లను ఎదుర్కొన్న ఓ వ్యక్తి కథ అని రూపేష్ పాల్ అంటున్నారు. ఓటమిని, వైఫల్యాలను నిర్భయంగా ఫేస్ చేసిన ఏ వ్యక్తి అయినా ఈ కథను తనకు అన్వయించుకోవచ్చునని ఆయన పేర్కొన్నాడు. ఈ సినిమాకు సంబంధించి యూఎస్, ఇటలీలో కొన్ని కీలక సన్నివేశాలను కొంతవరకు షూట్ చేశారు. ఇందులో రాహుల్ కుటుంబానికి చెందిన సభ్యుల పాత్రధారులను కూడా చూపడం విశేషం. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వచ్చే ఏప్రిల్ నెలలో ఈ బయో పిక్ విడుదల చేయాలనుకుంటున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







