రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- January 20, 2026
రియాద్: రియాద్ సీజన్కు సందర్శకుల సంఖ్య 14 మిలియన్లకు చేరుకుందని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) బోర్డు ఛైర్మన్ తుర్కి అల్-షేక్ ప్రకటించారు. రియాద్ సీజన్ అందించే కంటెంట్ అన్ని వయసుల వారి ఆసక్తులను ఆకర్షించడానికి రూపొందించిన సమగ్ర ప్రయాణాన్ని అందిస్తుందని అల్-షేక్ తెలిపారు.
ఇటీవల నిర్వహించిన "ఎ నైట్ ఆఫ్ హానర్ అండ్ హీరోస్".. రాయల్ మెరైన్స్తో కూడిన ప్రీమియం ఆర్కెస్ట్రా అనుభవాన్ని అందించిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజిటర్స్ ను ఆకర్షించేందుకు నిరంతరం వైవిధ్యమైన కంటెంట్ను అందిస్తూనే ఉంటామని అల్-షేక్ స్పష్టం చేశారు. ఇది రియాద్ ప్రపంచంలో ప్రధాన వినోద గమ్యస్థానంగా తన స్థానాన్ని బలోపేతం చేసే సమగ్ర ప్రణాళిక వ్యవస్థలో భాగంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుత రియాద్ సీజన్ లో బౌలేవార్డ్ సిటీ విజిటర్స్ ను విపరీతంగా ఆకర్షిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో విజిటర్స్ ను ఆకర్షించేలా మరింత వినూత్నంగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు అల్-షేక్ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









