ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- January 20, 2026
మనామా: హిద్ద్ లోని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రద్దీ సమయాల్లో ట్రక్కులపై ఉన్న నిషేధాన్ని పొడిగించాలనే డిమాండ్లపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ముహారక్ మున్సిపల్ కౌన్సిల్కు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అధికారికంగా సమాధానం ఇచ్చింది. బ్రిడ్జిపై ట్రక్రుల కదలికను పరిమితం చేయడానికి ప్రస్తుత నిషేధ సమయాలు సరిపోతాయని, ఈ దశలో ఎటువంటి మార్పులు అవసరం లేదని తెలిపింది.
ట్రాఫిక్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఉదయం 6:30 నుండి ఉదయం 8:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ట్రక్కులను నిషేధించామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ దరగ్ వివరించారు. రవాణా అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు వాణిజ్య, నిర్మాణం మరియు పారిశ్రామిక వృద్ధిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నిషేధ సమయాలను నిర్ణయించినట్లు బ్రిగేడియర్ అల్ డరాగ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







