ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- January 20, 2026
మనామా: హిద్ద్ లోని షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రద్దీ సమయాల్లో ట్రక్కులపై ఉన్న నిషేధాన్ని పొడిగించాలనే డిమాండ్లపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ముహారక్ మున్సిపల్ కౌన్సిల్కు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ అధికారికంగా సమాధానం ఇచ్చింది. బ్రిడ్జిపై ట్రక్రుల కదలికను పరిమితం చేయడానికి ప్రస్తుత నిషేధ సమయాలు సరిపోతాయని, ఈ దశలో ఎటువంటి మార్పులు అవసరం లేదని తెలిపింది.
ట్రాఫిక్ కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ఉదయం 6:30 నుండి ఉదయం 8:00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు ట్రక్కులను నిషేధించామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ దరగ్ వివరించారు. రవాణా అవసరాలు, అభివృద్ధి ప్రాజెక్టులు మరియు వాణిజ్య, నిర్మాణం మరియు పారిశ్రామిక వృద్ధిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే నిషేధ సమయాలను నిర్ణయించినట్లు బ్రిగేడియర్ అల్ డరాగ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!







