ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- January 20, 2026
హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా తెలంగాణ పోలీసు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సైబర్ నేరాల బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే, ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ‘సీ-మిత్ర’ పేరుతో ప్రత్యేక వర్చువల్ హెల్ప్ డెస్క్ను ప్రారంభించారు.
సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు సీ-మిత్ర ద్వారా బాధితులను స్వయంగా సంప్రదించి, ఏఐ సాయంతో ఫిర్యాదు డ్రాఫ్ట్ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 10 రోజుల్లో వెయ్యి మందికి ఫోన్ చేసి, 200 మందికి ఫిర్యాదులు తయారు చేయగా, నిమిషాల్లోనే ఎఫ్ఐఆర్ కాపీలు బాధితుల ఫోన్లకు పంపినట్లు తెలిపారు.
సైబర్ మోసానికి గురైన వారు ముందుగా 1930 హెల్ప్లైన్ లేదా జాతీయ సైబర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సీ-మిత్ర హెల్ప్ డెస్క్ ద్వారా ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలంగాణ పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









