షార్జాలో రోడ్డు ప్రమాదం: భారతీయ జంట మృతి
- February 13, 2019
షార్జాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో భారతీయ జంట ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో 9 ఏళ్ళ చిన్నారి కూడా వుంది. అతి వేగంతో దూసుకెళ్ళిన ఎస్యూవీని అదుపు చేయడంలో డ్రైవర్ విఫలమవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నజ్వా నుంచి షార్జా వైపు వస్తుండగా ప్రమాదానికి గురైన ఎస్యూవీ పలుమార్లు రోడ్డుపై పల్టీలు కొట్టింది. సమాచారం అందుకోగానే ట్రాఫిక్ అధికారుల టీమ్, పెట్రోల్ వెహికిల్స్, రెస్క్యూ అంబులెన్స్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మృతుల్ని అల్ ధయిద్ ఆసుపత్రికి తరలించగా, గాయపడ్డవారిని అల్ కాసిమి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మృతులు విజిట్ వీసాపై ఇండియా నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







