షార్జాలో రోడ్డు ప్రమాదం: భారతీయ జంట మృతి
- February 13, 2019
షార్జాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో భారతీయ జంట ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో 9 ఏళ్ళ చిన్నారి కూడా వుంది. అతి వేగంతో దూసుకెళ్ళిన ఎస్యూవీని అదుపు చేయడంలో డ్రైవర్ విఫలమవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నజ్వా నుంచి షార్జా వైపు వస్తుండగా ప్రమాదానికి గురైన ఎస్యూవీ పలుమార్లు రోడ్డుపై పల్టీలు కొట్టింది. సమాచారం అందుకోగానే ట్రాఫిక్ అధికారుల టీమ్, పెట్రోల్ వెహికిల్స్, రెస్క్యూ అంబులెన్స్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మృతుల్ని అల్ ధయిద్ ఆసుపత్రికి తరలించగా, గాయపడ్డవారిని అల్ కాసిమి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మృతులు విజిట్ వీసాపై ఇండియా నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







