షార్జాలో రోడ్డు ప్రమాదం: భారతీయ జంట మృతి
- February 13, 2019
షార్జాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో భారతీయ జంట ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో 9 ఏళ్ళ చిన్నారి కూడా వుంది. అతి వేగంతో దూసుకెళ్ళిన ఎస్యూవీని అదుపు చేయడంలో డ్రైవర్ విఫలమవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. నజ్వా నుంచి షార్జా వైపు వస్తుండగా ప్రమాదానికి గురైన ఎస్యూవీ పలుమార్లు రోడ్డుపై పల్టీలు కొట్టింది. సమాచారం అందుకోగానే ట్రాఫిక్ అధికారుల టీమ్, పెట్రోల్ వెహికిల్స్, రెస్క్యూ అంబులెన్స్ యూనిట్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మృతుల్ని అల్ ధయిద్ ఆసుపత్రికి తరలించగా, గాయపడ్డవారిని అల్ కాసిమి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మృతులు విజిట్ వీసాపై ఇండియా నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్







