అక్రమ కార్మికులకు అమ్నెస్టీ చివరి అవకాశం
- December 27, 2015
జులై నుంచి డిసెంబర్ వరకు ఏర్పాటు చేసిన అమ్నెస్టీని వినియోగించుకోవాలని అక్రమ కార్మికులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31తో ఈ అవకాశం ముగియనుంది. సుమారు 8 వేల మంది వలసదారులు అమ్నెస్టీ ద్వారా సాంత్వన పొందనున్నారు. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గాల ద్వారా బహ్రెయిన్లోకి ప్రవేశించి ఇక్కడి చట్టాలకనుగుణంగా ఇబ్బందులు పడ్తున్న అక్రమ కార్మికుల కోసం ఆరు నెలల గడువుతో అమ్నెస్టీ అవకాశం కల్పించింది. 'నేషనాలిటీ పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ) అన్ని ప్రక్రియలూ పూర్తి చేసి, గడువును ప్రకటించింది. ఎన్ఆర్పిఏ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ ఎగ్జిట్స్, సెర్చ్ అండ్ ఫాలో అప్ బ్రిగేడియర్ యూసఫ్ బిన్ అహ్మద్ అల్ ఘాతం, ఎంబసీలు తమవారిని గుర్తించి, ప్రాసెస్ని పూర్తి చేయాలనీ, లేదంటే గడువు దాటిన తర్వాత అక్రమ కార్మికులపై చట్టాలకనుగుణంగా శిక్షలు విధించబడ్తాయని అన్నారు. అలాగే, ఎన్పిఆర్ఏ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తుందనీ, చట్టాల్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారాయన.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







