ఒక్కటవ్వనున్న ఆర్య, సాయేషా
- February 14, 2019
చెన్నై: ప్రముఖ తమిళ నటుడు ఆర్య, సినీ నటి సాయేషా సైగల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమేనని ఆర్య ట్విటర్ వేదికగా ప్రకటించారు. సాయేషాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'మా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మేమిద్దరం మార్చిలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండి' అని పేర్కొంటూ అభిమానులకు వాలంటైన్స్ డే విషెస్ తెలిపారు.
ఆర్య, సాయేషా 'గజినీకాంత్' చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటికే ఇరు వైపు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. సాయేషా ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు. గతంలో ఆర్య 'ఎంగ వీటు మాప్పిళ్లై' పేరిట స్వయంవర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదే కార్యక్రమంలో తనకు నచ్చిన అమ్మాయిని ఎంచుకుని పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. కానీ ఆ కార్యక్రమం వివాదాస్పదం కావడంతో ఆపేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







