ఒక్కటవ్వనున్న ఆర్య, సాయేషా
- February 14, 2019చెన్నై: ప్రముఖ తమిళ నటుడు ఆర్య, సినీ నటి సాయేషా సైగల్ పెళ్లి చేసుకోబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల రోజును పురస్కరించుకుని తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమేనని ఆర్య ట్విటర్ వేదికగా ప్రకటించారు. సాయేషాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'మా తల్లిదండ్రులు, కుటుంబీకుల ఆశీస్సులతో మేమిద్దరం మార్చిలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నాం. మా కొత్త ప్రయాణం సంతోషంగా సాగాలని ఆశీర్వదించండి' అని పేర్కొంటూ అభిమానులకు వాలంటైన్స్ డే విషెస్ తెలిపారు.
ఆర్య, సాయేషా 'గజినీకాంత్' చిత్రంలో జంటగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. అప్పటికే ఇరు వైపు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి. సాయేషా ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనవరాలు. గతంలో ఆర్య 'ఎంగ వీటు మాప్పిళ్లై' పేరిట స్వయంవర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదే కార్యక్రమంలో తనకు నచ్చిన అమ్మాయిని ఎంచుకుని పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. కానీ ఆ కార్యక్రమం వివాదాస్పదం కావడంతో ఆపేశారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు