పుల్వామా టెర్రర్ ఎటాక్: అమరవీరులకు యూఏఈలో ఘన నివాళి
- February 18, 2019
యూఏఈ:యూఏఈలోని భారతీయులు, పుల్వామా టెర్రర్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, దుబాయ్లోని కాన్సులేట్ వద్ద ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భారతీయులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవల్ని కొనియాడుతూ, వారికి నివాళులర్పించడం జరిగింది. ఫిబ్రవరి 14న కాశ్మీర్లోని పుల్వామాలో తీవ్రవాదులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడిలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు అండగా వుండడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు. జరిగిన ఘటనను ఎప్పటికీ మర్చిపోబోమనీ, బదులు తీర్చుకుంటామని ఈ సందర్భంగా సూరి నినదించారు. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, అమరవీరులకు నివాళులర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా వుంటామని చెప్పారు.








తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









