పుల్వామా టెర్రర్ ఎటాక్: అమరవీరులకు యూఏఈలో ఘన నివాళి
- February 18, 2019యూఏఈ:యూఏఈలోని భారతీయులు, పుల్వామా టెర్రర్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, దుబాయ్లోని కాన్సులేట్ వద్ద ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భారతీయులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవల్ని కొనియాడుతూ, వారికి నివాళులర్పించడం జరిగింది. ఫిబ్రవరి 14న కాశ్మీర్లోని పుల్వామాలో తీవ్రవాదులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడిలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు అండగా వుండడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు. జరిగిన ఘటనను ఎప్పటికీ మర్చిపోబోమనీ, బదులు తీర్చుకుంటామని ఈ సందర్భంగా సూరి నినదించారు. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, అమరవీరులకు నివాళులర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా వుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి