పుల్వామా టెర్రర్ ఎటాక్: అమరవీరులకు యూఏఈలో ఘన నివాళి
- February 18, 2019
యూఏఈ:యూఏఈలోని భారతీయులు, పుల్వామా టెర్రర్ ఎటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ, దుబాయ్లోని కాన్సులేట్ వద్ద ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భారతీయులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవల్ని కొనియాడుతూ, వారికి నివాళులర్పించడం జరిగింది. ఫిబ్రవరి 14న కాశ్మీర్లోని పుల్వామాలో తీవ్రవాదులు, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ లక్ష్యంగా జరిపిన దాడిలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, బాధిత కుటుంబాలకు అండగా వుండడం మన బాధ్యత అని పిలుపునిచ్చారు. జరిగిన ఘటనను ఎప్పటికీ మర్చిపోబోమనీ, బదులు తీర్చుకుంటామని ఈ సందర్భంగా సూరి నినదించారు. దుబాయ్లో భారత కాన్సుల్ జనరల్ విపుల్ మాట్లాడుతూ, అమరవీరులకు నివాళులర్పించడం మనందరి బాధ్యత అని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా వుంటామని చెప్పారు.








తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







