ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది...
- February 18, 2019
ఇరాక్:సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరూ లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణం. కానీ, ఇరాక్లో ఓ మహిళ ఏకంగా ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరంతా ఒకే కాన్పులో జన్మించారు. ఇందులో ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.
ఇరాక్లోని దియాలీ ప్రావిన్స్లో ఉన్ ఓ ఆస్పత్రిలో 25 యేళ్ళ ఓ మహి ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళకు సాధారణ ప్రసవం కాగా, ఏడుగురి శిశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, తల్లీ కూడా క్షేమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ మహిళకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, వీరితో కలిపి మొత్తం 10 మంది అయ్యారు. ఒకే కాన్పులో ఏడుగురి పిల్లలకు జన్మనివ్వడం ఇరాకీలో ఇదే తొలిసారి కావొచ్చని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







