ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది...

- February 18, 2019 , by Maagulf
ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది...

ఇరాక్:సాధారణంగా ఒకే కాన్పులో ఇద్దరూ లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణం. కానీ, ఇరాక్‌లో ఓ మహిళ ఏకంగా ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరంతా ఒకే కాన్పులో జన్మించారు. ఇందులో ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు.
ఇరాక్‌లోని దియాలీ ప్రావిన్స్‌లో ఉన్ ఓ ఆస్పత్రిలో 25 యేళ్ళ ఓ మహి ఏడుగురు పిల్లలకు జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ మహిళకు సాధారణ ప్రసవం కాగా, ఏడుగురి శిశువుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, తల్లీ కూడా క్షేమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.


ఈ మహిళకు ఇప్పటికే ముగ్గురు సంతానం ఉండగా, వీరితో కలిపి మొత్తం 10 మంది అయ్యారు. ఒకే కాన్పులో ఏడుగురి పిల్లలకు జన్మనివ్వడం ఇరాకీలో ఇదే తొలిసారి కావొచ్చని వైద్యులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com