రక్తదానంపై అవగాహన పెరగాలి
- December 28, 2015
రక్తదానంపై అవగాహన పెరగాల్సి ఉందని, ఓ వ్యక్తి 400 మిల్లీ లీటర్ల రక్తాన్ని దానం చేస్తే, అది ఆపద సమయంలో ఉన్న ముగ్గురికి ఉపయోగపడ్తుందని వైద్యులు వెల్లడించారు. ఒమన్లో పెరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ వలన అత్యవసరంగా రక్తం అవసరమవుతోందనీ, బాధితులకు రక్తం అందించడంలో రక్త నిధి కేంద్రాలు ఒక్కోసారి రక్తం కొరతను ఎదుర్కొంటున్నాయని సలాహ్ లైఫ్లైన్ హాస్పిటల్ 'ఆపరేషన్స్ డైరెక్టర్' డాక్టర్ ఆసిఫ్ గని చెప్పారు. మెడికల్ డైరెక్టర్ షాహిద్ యూసఫ్ మాట్లాడుతూ, రక్తదానంపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ, రక్త దానం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సేఫ్ అనీ, తద్వారా శరీరంలోని కొలెస్టరాల్ లెవల్స్ని తగ్గించుకోవడానికి వీలవుతుందని చెప్పారు. ఓసారి రక్తదానం చేశాక చాలా తక్కువ సమయంలోనే ఆ రక్తం రికవరీ చేయబడ్తుందనీ, ఈ క్రమంలోనే బోన్ మ్యారో కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. ఎన్జివోలు, స్వచ్ఛంద సంస్థలు రక్త దానంపై చేపడ్తున్న అవగాహనా కార్యక్రమాల్ని మరింత ఉధృతంగా చేపట్టవలసి ఉందని డాక్టర్ ఆసిఫ్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







