పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి
- February 26, 2019
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మూడు చోట్ల భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారత వైమానిక దళానికి చెందిన 12 యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి. భారత వైమానిక దళం దాడితో, ఉగ్ర స్థావరాల్లో వున్న సుమారు 350 మందికి పైగా తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ దాడిని పాకిస్తాన్ ఖండిస్తుండగా, భారతదేశంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇటీవల పుల్వామాలో తీవ్రవాద ఘటనతో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పీఓకేపై వైమానిక దాడులకు రూపకల్పన చేసింది. ఇదిలా వుంటే, పాకిస్తాన్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం వుందన్న కోణంలో సరిహద్దుల్లో భారత సైన్యం, పూర్తిస్థాయిలో మోహరించింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







