మతపరమైన పుస్తకాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్
- February 28, 2019
బహ్రెయిన్: ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తులు మతపరమైన పుస్తకాల మాటున మరిజువానా డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించగా, వారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఢాకా నుంచి వచ్చినవారిగా గుర్తించారు అధికారులు. కస్టమ్స్ అధికారి, నిందితులపై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి మరిజువానాను స్వాధీనం చేసుకోగలిగారు. ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు నిందితులు మతపరమైన పుస్తకాల్ని వాడుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే విచారణ సందర్బంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. కాగా, నిందితులకి న్యాయస్థానం పదిహేనేళ్ళ జైలు శిక్షతోపాటుగా 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. శిక్షా కాలం పూర్తయ్యాక నిందితుల్ని డిపోర్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









