మతపరమైన పుస్తకాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్
- February 28, 2019
బహ్రెయిన్: ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తులు మతపరమైన పుస్తకాల మాటున మరిజువానా డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించగా, వారిని అరెస్ట్ చేశారు. నిందితులు ఢాకా నుంచి వచ్చినవారిగా గుర్తించారు అధికారులు. కస్టమ్స్ అధికారి, నిందితులపై అనుమానంతో తనిఖీలు నిర్వహించగా, వారి నుంచి మరిజువానాను స్వాధీనం చేసుకోగలిగారు. ఎవరికీ అనుమానం రాకుండా వుండేందుకు నిందితులు మతపరమైన పుస్తకాల్ని వాడుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే విచారణ సందర్బంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించలేదు. కాగా, నిందితులకి న్యాయస్థానం పదిహేనేళ్ళ జైలు శిక్షతోపాటుగా 5,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది. శిక్షా కాలం పూర్తయ్యాక నిందితుల్ని డిపోర్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!









