మోడీ ఇమ్రాన్లతో మాట్లాడిన షేక్ మొహమ్మద్.!
- March 01, 2019
భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరు దేశాల ప్రధాన మంత్రులతో ఫోన్లో మాట్లాడినట్లు యుఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ చెప్పారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు చెప్పిన క్రౌన్ ప్రిన్స్ చర్చలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్తోనూ, నరేంద్రమోడీతోనూ విడి విడిగా మాట్లాడినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యుఏఈ ఇరుదేశాలతోనూ స్నేహ సంబంధాలు కోరుకుంటోందని ఆయా దేశాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారనీ, అందరూ శాంతిని కోరుకుంటున్నారనీ ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే భారత వైమానిక దళానికి చెందిని వింగ్ కమాండర్ అభినందన్ని విడుదల చేసేందుకు ఇమ్రాన్ఖాన్ సుముఖత వ్యక్తం చేశారు. కాసేపట్లో అభినందన్ని విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









