మోడీ ఇమ్రాన్లతో మాట్లాడిన షేక్ మొహమ్మద్.!
- March 01, 2019
భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇరు దేశాల ప్రధాన మంత్రులతో ఫోన్లో మాట్లాడినట్లు యుఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ చెప్పారు. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆశిస్తున్నట్లు చెప్పిన క్రౌన్ ప్రిన్స్ చర్చలతోనే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇమ్రాన్ ఖాన్తోనూ, నరేంద్రమోడీతోనూ విడి విడిగా మాట్లాడినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. యుఏఈ ఇరుదేశాలతోనూ స్నేహ సంబంధాలు కోరుకుంటోందని ఆయా దేశాలకు చెందిన ప్రజలు కలిసి మెలిసి ఉంటున్నారనీ, అందరూ శాంతిని కోరుకుంటున్నారనీ ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే భారత వైమానిక దళానికి చెందిని వింగ్ కమాండర్ అభినందన్ని విడుదల చేసేందుకు ఇమ్రాన్ఖాన్ సుముఖత వ్యక్తం చేశారు. కాసేపట్లో అభినందన్ని విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









