12 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

- March 04, 2019 , by Maagulf
12 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్‌

అబుదాబీ బిగ్‌ టికెట్‌ రాఫెల్ లో 12 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్నారు భారతదేశానికి చెందిన రాగీ జార్జ్‌. కేరళలోని అలప్పుజాకి చెందిన రాగీ జార్జ్‌, కువైట్‌లో నివసిస్తున్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి రాఫెల్ ను నిర్వహించిన రిచార్డ్‌ ఈ విషయాన్ని చెప్పగానే, రాగీ జార్జ్‌ అస్సలేమాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోయారట. ఈ ఏడాది వరుసగా రెండు నెలల్లోనూ కేరళకు చెందినవారే మెగా ప్రైజ్‌ని గెలుస్తూ వస్తున్నారు. కాగా, తాను 12 ఏళ్ళ నుంచీ కువైట్‌లో నివసిస్తున్నాననీ, తన కుమార్తె 10వ గ్రేడ్‌ చదువుతోందనీ, మరో ఏడాది రెండేళ్ళలో ఇండియాకి వెళదామనుకున్నామనీ జార్జ్‌ చెప్పారు. ఓ ప్రైవేటు సంస్థలో పర్చేజ్‌ డిపార్ట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌గా జార్జ్‌ విధులు నిర్వహిస్తున్నారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com