4.33 మిలియన్‌ ఉమ్రా వీసాల్ని జారీ చేసిన సౌదీ

- March 04, 2019 , by Maagulf
4.33 మిలియన్‌ ఉమ్రా వీసాల్ని జారీ చేసిన సౌదీ

సౌదీ అరేబియా ఈ ఏడాది 4.33 మిలియన్‌ ఉమ్రా వీసాలను జారీ చేసింది. ఈ విషయాన్ని ఔదీ మినిస్ట్రీ ఆఫ్‌ హజ్‌ అండ్‌ ఉమ్రా పేర్కొంది. మొత్తంగా 4,338,959 వీసాలు మంజూరు చేయడం జరిగిందనీ, 3,892554 యాత్రీకులు కింగ్‌డమ్‌కి వచ్చారనీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 443,560 మంది యాత్రీకులు దేశంలోనే ఇంకా వుండగా, 304,897 మంది మక్కాలోనూ, 138,663 మంది మదీనాలోనూ వున్నారు. 3,464,929 మంది వాయు మార్గంలో వచ్చారు. సముద్ర మార్గంలో 34,993 రాగా, రోడ్డు మార్గంలో 392,632 మంది రోడ్డు మార్గంలో వచ్చారు. పాకిస్తాన్‌ నుంచి అత్యధికంగా 949,895 మంది, ఆ తర్వాతి స్థానంలో 633,253 రాగా, భారతదేశం నుంచి 408,495 మంది కింగ్‌డమ్‌కి విచ్చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com