అమెరికాపై విరుచుకుపడ్డ టోర్నడో.. అలబామా అతలాకుతలం..
- March 04, 2019
అలబామా : అమెరికాలో టోర్నడో విరుచుకుపడింది. అలబామా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. టోర్నడో భీభత్సానికి 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు పెద్దసంఖ్యలో ఇళ్లు ధ్వంసం కాగా.. వందలాది సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. సౌత్ ఈస్ట్ అలబామాలో టోర్నడో తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఇళ్లు నేలకూలడంతో చాలామంది గల్లంతయ్యారు. ఎమర్జెన్సీ స్క్వాడ్ రంగంలోకి దిగింది. సహాయకచర్యలు ముమ్మరం చేస్తూనే.. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చాలా ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకమేర్పడినట్లు సమాచారం. చెట్లు నేలకూలి రహదారులపై పడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సోమవారం నాడు కూడా మరో టోర్నడో వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీంతో అలబామా ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా ఏరియాల్లో టోర్నడో ఏర్పడే ఛాన్సుందని హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









