రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వివరాలు..
- March 09, 2019తెలంగాణ:పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అధిక సీట్లు సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలోభాగంగా ఆయన నాందేడ్ నుంచి బైంసాకు రానున్నారు.
శంషాబాద్ లోని క్లాసిక్ కన్వేన్షన్ సెంటర్ పక్కనున్న గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్న మొదటి సభ కాగా అసెంబ్లీ ఎన్నికల తరువాత రాహుల్ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. ఇక రేపు శంషాబాద్ లోని ఓ హోటల్ లో పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సుమారు గంట సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది. రాహుల్ పర్యటన కాంగ్రెస్ కేడర్లో ఉత్సహం నింపుతుంది అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్ప్రెస్ వే మూసివేత