నూతన సంవత్సరం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు
- December 29, 2015
నూతన సంవత్సరం సందర్భంగా దేశంలో లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో పలుచోట్ల ఉగ్రవాదులు దాడులకు యత్నించే అవకాశం ఉందని... నూతన సంవత్సర వేడుకలను ఇందుకు వేదిక చేసుకోనున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని... అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించాయి. పాక్ నుంచి 1520 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని... ముంబయి తరహా దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలతో పాటు సైనిక, అణు సంబంధిత ప్రాంతాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భద్రతను కట్టుదిట్టం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







