నూతన సంవత్సరం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు
- December 29, 2015
నూతన సంవత్సరం సందర్భంగా దేశంలో లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో పలుచోట్ల ఉగ్రవాదులు దాడులకు యత్నించే అవకాశం ఉందని... నూతన సంవత్సర వేడుకలను ఇందుకు వేదిక చేసుకోనున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని... అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించాయి. పాక్ నుంచి 1520 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని... ముంబయి తరహా దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలతో పాటు సైనిక, అణు సంబంధిత ప్రాంతాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భద్రతను కట్టుదిట్టం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







