నూతన సంవత్సరం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు

- December 29, 2015 , by Maagulf
నూతన సంవత్సరం సందర్భంగా ఉగ్రవాదులు దాడులు

నూతన సంవత్సరం సందర్భంగా దేశంలో లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో పలుచోట్ల ఉగ్రవాదులు దాడులకు యత్నించే అవకాశం ఉందని... నూతన సంవత్సర వేడుకలను ఇందుకు వేదిక చేసుకోనున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని... అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాలని సూచించాయి. పాక్‌ నుంచి 1520 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని... ముంబయి తరహా దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రుల నివాసాలతో పాటు సైనిక, అణు సంబంధిత ప్రాంతాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు భద్రతను కట్టుదిట్టం చేయాలని హెచ్చరికలు జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com