పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం
- March 14, 201938 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రస్ అల్ ఖైమాలో ఈ రోడు& డప్రమాదం జరిగింది. పొగమంచు ఎక్కువగా వుండడమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఎమిరేట్స్ రోడ్ రౌండెబౌట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్, ఉదయం 6.15 నిమిషాల సమయంలో ప్రమాద సమాచారాన్ని అందుకుంది. వెంటనే ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్, పారామెడిక్స్ అలాగే రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందు వెళుతున్న ట్రక్ని పొగమంచు కారణంగా గమనించని వ్యక్తి, తన వాహనంతో ఆ ట్రక్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు లో పరిమిత వేగంతో ప్రయాణించాలని హెచ్చరిస్తున్నా, వాహనదారులు నిబంధనలు పాటించడంలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. కల్నల్ నక్బి మాట్లాడుతూ, వాహనదారులు అప్రమత్తంగా వుంటే చాలావరకు ప్రమాదాల్ని నివారించవచ్చునని చెప్పారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి