31న దేశ రాజధాని ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన

- December 29, 2015 , by Maagulf
31న దేశ రాజధాని ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సరం కానుకగా ఈ నెల 31న దేశ రాజధాని ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ ను నియంత్రించాలానే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరం.. ఢిల్లీకి ఈశాన్యదిశగా 70 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఇదే అతి పెద్ద నగరం. మీరట్-ఢిల్లీ జాతీయ రహదారి 58 నిత్యం రద్దీగా ఉంటుంది. ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం గత నెలలో మోదీ 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీ మహా నగరాన్ని అనుసంధానం చేసే మూడు హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com