31న దేశ రాజధాని ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన
- December 29, 2015
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త సంవత్సరం కానుకగా ఈ నెల 31న దేశ రాజధాని ఢిల్లీ-మీరట్ ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ ను నియంత్రించాలానే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరం.. ఢిల్లీకి ఈశాన్యదిశగా 70 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఇదే అతి పెద్ద నగరం. మీరట్-ఢిల్లీ జాతీయ రహదారి 58 నిత్యం రద్దీగా ఉంటుంది. ఢిల్లీ పరిసరాల్లో ట్రాఫిక్ ను నియంత్రించడం కోసం గత నెలలో మోదీ 10 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఢిల్లీ మహా నగరాన్ని అనుసంధానం చేసే మూడు హైవే ప్రాజెక్టులను ప్రారంభించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







