ఎల్ఐసీ కొత్త పాలసీ.. పొదుపుతో పాటు భద్రత కూడా..
- March 20, 2019
ప్రభుత్వ రంగానికి చెందిన బీమా సంస్థ ఎల్ఐసీ వినియోగదారుల కోసం ఓ కొత్త పాలసీ తీసుకు వచ్చింది. నవజీవన్ పేరుతో వచ్చిన ఈ పాలసీ రక్షణతో పాటు ఆదాయాన్ని అందిస్తుంది. 90 రోజులు ఉన్న పిల్లల నుంచి 65 సంవత్సరాల వృద్ధుల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం ఒకేసారి కట్టవచ్చు లేదా ఐదేళ్ల వరకు ప్రీమియం చెల్లించే వెసులు బాటు కల్పించింది సంస్థ. ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. పాలసీపై లోన్ కూడా తీసుకోవచ్చు. పన్ను రాయితీని కూడా అందిస్తుంది. హైదరాబాద్లోని ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయంలో రీజినల్ జోనల్ మేనేజర్ (మార్కెటింగ్) జగన్నాథ్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో జోనల్ మేనేజర్ (ఇన్చార్జ్) వినోద కుమారి ఈ పాలసీని మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ పాలసీని ప్రారంభించిన రోజునే దేశవ్యాప్తంగా మూడు వేల మంది తీసుకోగా, సౌత్ సెంట్రల్ జోన్లో 700 మంది తీసుకున్నట్లు ఎల్ఐసీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా
- భారత్ పై అమెరికన్ మహిళ ప్రశంసలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!







