ఐఆర్సీటీసీ కొత్త రూల్..
- March 26, 2019
వెళ్లిన పని అవలేదు. సమయానికి స్టేషన్కి చేరుకోగలమా లేదా అన్న టెన్షన్. లేకపోతే ట్రైన్ మిస్సయిపోతుంది. పోనీ ఆ స్టేషన్ మిస్సయితే మరో స్టేషన్లో రైలెక్కొచ్చు. ఈఅవకాశాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. టికెట్ రిజర్వ్ చేసుకున్న సమయంలో సూచించిన బోర్డింగ్ స్టేషన్ కాకుండా మరో స్టేషన్లో రైలు ఎక్కేలా ప్రయాణికులు మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
అయితే రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందే మీ బోర్డింగ్ స్టేషన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటలకు ట్రైన్ అయితే స్టేషన్ మార్చుకోవాలనుకుంటే సాయింత్రం నాలుగు గంటల లోపే మార్చుకోవాలి. గతంలో అయితే 24 గంటల ముందు మార్చుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా తీసుకు వచ్చిన ఈ మార్పు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్నవారు ఆన్లైన్లో స్టేషన్ మార్చుకోవచ్చు.
రైల్వే కౌంటర్లో టికెట్ బుక్ చేసుకున్నవారు రైల్వే ఎంక్వైరీ 139 నెంబర్కు కాల్ చేసి బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. తత్కాల్ టికెట్లు తీసుకున్నవారు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. మొదట ఈ విధానం శతాబ్ధి, రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లకు ఉండేది. ఇప్పుడు మిగతా రైళ్లకూ అనుమతి ఇస్తున్నారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







