ఐఆర్సీటీసీ కొత్త రూల్..
- March 26, 2019
వెళ్లిన పని అవలేదు. సమయానికి స్టేషన్కి చేరుకోగలమా లేదా అన్న టెన్షన్. లేకపోతే ట్రైన్ మిస్సయిపోతుంది. పోనీ ఆ స్టేషన్ మిస్సయితే మరో స్టేషన్లో రైలెక్కొచ్చు. ఈఅవకాశాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. టికెట్ రిజర్వ్ చేసుకున్న సమయంలో సూచించిన బోర్డింగ్ స్టేషన్ కాకుండా మరో స్టేషన్లో రైలు ఎక్కేలా ప్రయాణికులు మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
అయితే రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందే మీ బోర్డింగ్ స్టేషన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటలకు ట్రైన్ అయితే స్టేషన్ మార్చుకోవాలనుకుంటే సాయింత్రం నాలుగు గంటల లోపే మార్చుకోవాలి. గతంలో అయితే 24 గంటల ముందు మార్చుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా తీసుకు వచ్చిన ఈ మార్పు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్నవారు ఆన్లైన్లో స్టేషన్ మార్చుకోవచ్చు.
రైల్వే కౌంటర్లో టికెట్ బుక్ చేసుకున్నవారు రైల్వే ఎంక్వైరీ 139 నెంబర్కు కాల్ చేసి బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. తత్కాల్ టికెట్లు తీసుకున్నవారు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. మొదట ఈ విధానం శతాబ్ధి, రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లకు ఉండేది. ఇప్పుడు మిగతా రైళ్లకూ అనుమతి ఇస్తున్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







