ఐఆర్‌సీటీసీ కొత్త రూల్..

- March 26, 2019 , by Maagulf
ఐఆర్‌సీటీసీ కొత్త రూల్..

వెళ్లిన పని అవలేదు. సమయానికి స్టేషన్‌కి చేరుకోగలమా లేదా అన్న టెన్షన్. లేకపోతే ట్రైన్ మిస్సయిపోతుంది. పోనీ ఆ స్టేషన్ మిస్సయితే మరో స్టేషన్‌లో రైలెక్కొచ్చు. ఈఅవకాశాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. టికెట్ రిజర్వ్ చేసుకున్న సమయంలో సూచించిన బోర్డింగ్ స్టేషన్ కాకుండా మరో స్టేషన్‌లో రైలు ఎక్కేలా ప్రయాణికులు మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

అయితే రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందే మీ బోర్డింగ్ స్టేషన్‌ని మార్చుకోవాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటలకు ట్రైన్ అయితే స్టేషన్ మార్చుకోవాలనుకుంటే సాయింత్రం నాలుగు గంటల లోపే మార్చుకోవాలి. గతంలో అయితే 24 గంటల ముందు మార్చుకునే వెసులుబాటు ఉండేది. తాజాగా తీసుకు వచ్చిన ఈ మార్పు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. ఐఆర్‌సీటీసీలో టికెట్ బుక్ చేసుకున్నవారు ఆన్‌లైన్‌లో స్టేషన్ మార్చుకోవచ్చు.

రైల్వే కౌంటర్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారు రైల్వే ఎంక్వైరీ 139 నెంబర్‌కు కాల్ చేసి బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. తత్కాల్ టికెట్లు తీసుకున్నవారు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు. మొదట ఈ విధానం శతాబ్ధి, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఉండేది. ఇప్పుడు మిగతా రైళ్లకూ అనుమతి ఇస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com