100 కోట్ల క్లబ్ లో "కేసరి"
- March 29, 2019అక్షయ్ కుమార్ హీరోగా, అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన "కేసరి" చిత్రం ఈనెల 21న విడుదలయ్యింది. ఈ సినిమా తొలి రోజునే 21 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి, ఈ ఏడాది తొలిరోజు అత్యధికంగా వసూళ్ళను రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. మొదటి మూడు రోజుల్లో సినిమా దాదాపు రూ.50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. 7 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతవరకూ అక్షయ్ కుమార్ చేసిన సినిమాల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన 11వ సినిమాగా "కేసరి" రికార్డులకెక్కింది. ఈ ఏడాది చాలా తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రంగా "కేసరి" సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం మరో విశేషం. "కేసరి" కథ విషయానికొస్తే.1897లో పాకిస్థాన్లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. 21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ సినిమా స్టోరీ. ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన "కేసరి" సినిమాలో అక్కీ "హవల్దార్ ఇషార్ సింగ్" పాత్రలో నటించాడు. "కేసరి" అంటే అర్థం త్యాగానికి గుర్తు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన పరిణీతి చోప్రా నటించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగిన సినిమాలు కూడా లేకపోవడంతో "కేసరి" తన హవాను మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ