100 కోట్ల క్లబ్ లో "కేసరి"
- March 29, 2019
అక్షయ్ కుమార్ హీరోగా, అనురాగ్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన "కేసరి" చిత్రం ఈనెల 21న విడుదలయ్యింది. ఈ సినిమా తొలి రోజునే 21 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి, ఈ ఏడాది తొలిరోజు అత్యధికంగా వసూళ్ళను రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. మొదటి మూడు రోజుల్లో సినిమా దాదాపు రూ.50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. 7 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతవరకూ అక్షయ్ కుమార్ చేసిన సినిమాల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన 11వ సినిమాగా "కేసరి" రికార్డులకెక్కింది. ఈ ఏడాది చాలా తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రంగా "కేసరి" సరికొత్త రికార్డును సొంతం చేసుకోవడం మరో విశేషం. "కేసరి" కథ విషయానికొస్తే.1897లో పాకిస్థాన్లో ఉన్న సారాగర్హిల జరిగిన యుద్ధ నేపథ్యంలో తెరకెక్కింది. 21 మంది సిక్కు యోధులు పదివేల మంది అఫ్ఘనులను ఎలా ఓడించారనేదే ఈ సినిమా స్టోరీ. ఒళ్లు గగుర్పొడిచే సంఘటనల ఆధారంగా తెరకెక్కిన "కేసరి" సినిమాలో అక్కీ "హవల్దార్ ఇషార్ సింగ్" పాత్రలో నటించాడు. "కేసరి" అంటే అర్థం త్యాగానికి గుర్తు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన పరిణీతి చోప్రా నటించింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగిన సినిమాలు కూడా లేకపోవడంతో "కేసరి" తన హవాను మరికొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







