చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్

- March 30, 2019 , by Maagulf
చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్

జైషే చీఫ్‌ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మరోసారి గట్టి మద్దతు లభించింది. చైనా సపోర్టుతో తప్పించుకుంటున్న మసూద్ అజర్‌ను అగ్రరాజ్యం అమెరికా, డైరెక్టుగా టార్గెట్ చేసింది. మసూద్‌పై నిషేధం విధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ప్రవేశపెట్టింది. అమెరికా తీరుపై చైనా కస్సుమంది. బలవంతంగా తీర్మానం చేయించడం సరైంది కాదని చైనా ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com