సినిమాలే తర్వాతే హానీమూన్ అంటున్న ఆర్య భార్య
- March 31, 2019
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సాయేషా సైగల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలవడంతో తెలుగులో మళ్లీ ఈ భామకు అవకాశం రాలేదు. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో సినిమా చేస్తు ఫుల్ బిజీ హీరోయిన్గా మారింది. ఇదే సమయంలో తమిళ లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్న ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సాయేషా సైగల్. ఆర్య - సాయేషా సైగల్ పెళ్లి ఘనంగా జరిగింది. తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ, బాలీవుడ్ ప్రముఖులు కూడా వీరి పెళ్లికి హాజరైయ్యారు.
పెళ్లి కారణంగా సాయేషా తాను నటిస్తున్న సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. పెళ్లి కారణంగా విరామం తీసుకున్న సాయేషా తిరిగి మళ్లీ తన సినిమా షూటింగ్లో పాల్గొంది. తొలిసారిగా కన్నడలో ఆమె పునీత్ రాజ్ కుమార్ సరసన 'యువరత్న' సినిమాలో నటిస్తోంది. బెంగుళూరులో జరుగుతోన్న షూటింగులో ఆమె జాయిన్ అయింది. ఈ సినిమాతో పాటు రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది. సినిమా షూటింగ్ ఇబ్బంది కలుగకూడదని భావించిన సాయేషా తమ హానీమూన్ని కూడా వాయిదా వేసుకుంది. సినిమాల ఒత్తిడి తీరిన తరువాత తన హానీమూన్ని ప్లాన్ చేసుకోనుంది ఈ భామ.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







