పోలింగ్ సమయం పెంచిన ఈసీ

- April 04, 2019 , by Maagulf
పోలింగ్ సమయం పెంచిన ఈసీ

ఇండియా:ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమాయాన్ని మరో గంట పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరిపారు.

ఈసారి అన్ని చోట్ల వీవీ ప్యాట్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈవీఎంల విధానంలో ఓటు వేశాక ఎవరికి వేశామో ఓటరు వీవీప్యాట్‌ పరికరం ద్వారా చూసుకోవచ్చు. ప్యాట్‌లో ఏడు సెకన్ల పాటు ఓటు వేసిన గుర్తు కనిపిస్తుంది. దీంతో పోలింగ్‌కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. అటు ఓటర్లు సైతం గతంలో కంటే పెరిగారు. వేసవి కావడంతో సాయంత్రం సమయాల్లో ఓటర్లు ఎక్కువగా పోలింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com