పోలింగ్ సమయం పెంచిన ఈసీ
- April 04, 2019
ఇండియా:ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమాయాన్ని మరో గంట పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిపారు.
ఈసారి అన్ని చోట్ల వీవీ ప్యాట్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈవీఎంల విధానంలో ఓటు వేశాక ఎవరికి వేశామో ఓటరు వీవీప్యాట్ పరికరం ద్వారా చూసుకోవచ్చు. ప్యాట్లో ఏడు సెకన్ల పాటు ఓటు వేసిన గుర్తు కనిపిస్తుంది. దీంతో పోలింగ్కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. అటు ఓటర్లు సైతం గతంలో కంటే పెరిగారు. వేసవి కావడంతో సాయంత్రం సమయాల్లో ఓటర్లు ఎక్కువగా పోలింగ్కు వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్









