గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ..
- April 04, 2019
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు ఏడాది తరువాత మళ్లీ 6 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ 6.25 శాతంగా రెపో రేటు అమలవుతోంది. ఇందుకు ఎంపీసీ 4:2 వోటింగ్తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎంఎస్ఎఫ్తోపాటు.. బ్యాంక్ రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికిఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తే లభించే రివర్స్ రెపో రేటు సైతం 6 శాతం నుంచి 5.75 శాతానికి పరిమితంకానుంది.
కొత్త ఏడాదిలో..
కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో చేపట్టిన తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ఇది కాగా.. దేశీ స్టాక్ మార్కెట్లు అమ్మకాలతో వెనకడుగు వేశాయి. అయితే అత్యధిక శాతం మంది విశ్లేషకులు పావు శాతం రెపో రేటులో కోతను అంచనా వేసిన విషయం విదితమే. కాగా.. ఇంతక్రితం ఈ ఏడాది ఫిబ్రవరి 7న చేపట్టిన పాలసీ సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పావు శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో రెపో రేటు 6.25 శాతంగా అమలవుతోంది. రివర్స్ రెపో రేటు సైతం 6.25 శాతం నుంచి 6 శాతానికి పరిమితమైంది. కఠినతర విధానాలను వీడి న్యూట్రల్గా వ్యవహరించాలని గత సమీక్షలో ఎంపీసీ అభిప్రాయపడటం గమనించదగ్గ అంశం. తాజా సమావేశాలలోనూ 5:1 ఓటింగ్తో ఎంపీసీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం!
జీడీపీ 7.2 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి సాధించవచ్చని ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. గతంలో 7.4 శాతం వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. ఈ బాటలో తొలి అర్ధభాగానికి 6.8-7.1 శాతం స్థాయిలో జీడీపీ పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









