పోలింగ్ సమయం పెంచిన ఈసీ
- April 04, 2019
ఇండియా:ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ సమాయాన్ని మరో గంట పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిపారు.
ఈసారి అన్ని చోట్ల వీవీ ప్యాట్ పరికరాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈవీఎంల విధానంలో ఓటు వేశాక ఎవరికి వేశామో ఓటరు వీవీప్యాట్ పరికరం ద్వారా చూసుకోవచ్చు. ప్యాట్లో ఏడు సెకన్ల పాటు ఓటు వేసిన గుర్తు కనిపిస్తుంది. దీంతో పోలింగ్కు ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంది. అటు ఓటర్లు సైతం గతంలో కంటే పెరిగారు. వేసవి కావడంతో సాయంత్రం సమయాల్లో ఓటర్లు ఎక్కువగా పోలింగ్కు వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







