రాష్ట్రంలో మార్చి చివరి నాటికి 2 లక్షల గృహాలు..
- December 30, 2015
రాష్ట్రంలో మార్చి చివరి నాటికి 2 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన చైైర్మన వర్ల రామయ్య అన్నారు. బుధవారం మార్కెట్యార్డు ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నుంచి పట్టణాలకు 1 లక్షా 93 వేల గృహాలు మంజూరయ్యాయన్నారు. ఇదంతా చంద్రబా బునాయుడు కృషేనన్నారు. రానున్న 3 సంవత్స రాలలో మరో 10 లక్షల గృహాలు నిర్మించే అవకా శం ఉందన్నారు. పేదలందరికి పక్కా గృహాలు నిర్మించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహా నిర్మాణాలను ముఖ్యమంత్రి చంద్రబా బునాయు డు అడుగడుగున పర్యవేక్షిస్తారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గృహాల నిర్మాణానికి బడ్జెట్ను పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కు తుందన్నారు. ఒక్కొక్క గృహ నిర్మాణానికి రూ. 2 లక్షల 75 వేలు మంజూరు చేయటం జరుగు తుందన్నారు. ఎస్సీ లకు మరుగుదొడ్డి నిర్మాణ నిమిత్తం అదనంగా మరో రూ.15 వేలు మంజూ రు చేస్తామన్నారు. పేదవాడి ఎదుగుదలను టీడీపీ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. పూరిల్లు లేని సమాజం చూడాలన్నదే చంద్రబాబునా యుడు లక్ష్యమన్నారు. సీఎం మహా యజ్ఞంలో సమిధలులా పని చేసే అవకాశం తమకు కల్పించారన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మె ల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మున్సిపల్ చైైైర్మన యెల్లినేడి రామస్వామి, ఎంపీపీ బొర్రా కోటేశ్వ రరావు, మార్కెట్ యార్డు కమిటీ మాజీ చైైర్మన మక్కపాటి రామచంద్రరావు, ముసునూరి శేఖ ర్బాబు, ముప్పాళ్ళ ఎంపీపీ ఉమాదేవి, తెలు గు మహిళా నాయకురాలు భీమినేని వంద నా దేవి, దేశం నాయకులు బత్తుల చంద్రశేఖర్, వ క్కంటి అజయ్, అంకాళ్ళ ప్రభుదాసు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







